ఎన్ఎస్యూఐ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అడ్వకేట్ బానోతు సాగర్ నాయక్ నియామకం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అడ్వకేట్ బానోతు సాగర్ నాయక్ నియమితులయ్యారు.
ప్రస్తుతం అడ్వకేట్గా న్యాయవృత్తిలో కొనసాగుతున్న బానోతు సాగర్ నాయక్ గతంలో నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు, విద్యా రంగానికి సంబంధించిన అంశాలు, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఆయన చురుకుగా పనిచేశారు.
విద్యార్థి నాయకుడిగా గతంలో నిర్వహించిన బాధ్యతలు, నాయకత్వ అనుభవాన్ని గుర్తించిన ఎన్ఎస్యూఐ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఆయనకు తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా కీలక బాధ్యతలు అప్పగించింది.
ఈ సందర్భంగా బానోతు సాగర్ నాయక్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అవకాశం కల్పించిన ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షులు వినోద్ జకార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ స్వామితో పాటు జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని బానోతు సాగర్ నాయక్ తెలిపారు.

























