ఉత్తమ ప్రతిభకు కోనసముందర్ ‘అమ్మఒడి స్వచ్ఛంద సేవాసంస్థ’ ప్రోత్సాహకం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని కోనసముందర్ గ్రామంలో అమ్మ ఒడి సేవాసంస్థ ఇదివరకే అనేక సేవ కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు చదువులో , ఆటల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారికి ప్రతీ సంవత్సరం అమ్మఒడి స్వచ్ఛంద సేవ సంస్థ ప్రశంసా పత్రాలు, మెమోoటోస్, మెడల్స్, నగదు బహుమతి రూపంలో ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ సంవత్సరం కు గాను సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యారులకు బహుమతులు అందించి సత్కరించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతస్థాయి కి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెజ్జారం రాకేష్, ఉప సర్పంచ్ బాలేరావ్ శంకర్, వీడిసి అధ్యక్షుడు సూర గంగాధర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుపాల్, ఉపాద్యాయులు బృందం, అమ్మ ఒడి సంస్థ సభ్యులు అవుసుల సాగర్, ఆకుల శ్రీనివాస్, గాండ్ల గంగారెడ్డి, సూర సంజీవ్, సూర సంతోష్, కుమ్మరి శ్రీకాంత్, ఈదుల్ల గంగాధర్, అంబల్ల నవీన్, సూర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.























