ఐకమత్యానికి చిహ్నం వనభోజనాలు…
హరినామ సంకీర్తనలతో మార్మోగిన శ్రీ సంత మల్లన్న స్వామి గుట్ట…
సహపంక్తి భోజనాల్ని ఆరగించిన శ్రీ గోవింద గిరి స్వామి శిష్యులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
వేల్పూర్ కు చెందిన శ్రీ గోవింద గిరి దివ్య యోగాశ్రమము వ్యవస్థాపకులు, కుండలిని జ్ఞానయోగి, అవధూత బ్రహ్మ, శ్రీ శ్రీ శ్రీ గోవింద గిరి స్వామి శిష్యులు ఆషాడమాసం సోమవారం రోజున వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ శివారులో గల శ్రీ సంత మల్లన్న స్వామి (గుట్ట) దేవాలయం ప్రాంగణంలో వనభోజనాలకు వెళ్లారు. చక్కటి ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో వంటలు చేసుకున్నారు. తదనంతరం శ్రీ సంత మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేసి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించారు. గంటల తరబడి నిరవధికంగా భజనలు చేయడంతో ఆలయ ప్రాంగణమంతా హరినామ సంకీర్తనలతో మార్మోగింది. నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివా, కరిముఖ గణరాయా, శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా అంటూ శివునిపై బ్రహ్మాండమైన భజన పాటల్ని ఆలపించారు. పంచామృతాహారాలల్ని వండుకొని సహ పంక్తి భోజనాలు చేశారు. రోజంతా ఆడుతూ పాడుతూ ఆనంద పరవశులయ్యారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ పెద్దలు సాంప్రదాయంగా పెట్టిన వనభోజనాలు ఐకమత్యానికి చిహ్నంగా నిలుస్తాయని, శిష్యులంతా ఐక్యంగా ఉండి ఆధ్యాత్మిక ఉన్నతిని పొంది రాణించాలి అని అన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గోవింద గిరి స్వామి శిష్యులు, భజన కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.























