ధర్పల్లి జడ్పీహెచ్ఎస్లో ఘనంగా వన మహోత్సవం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
గురువారం ధర్పల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీధర్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి వివిధ రకాల మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మురళీధర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలను విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సంరక్షించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

























