గుడితండా ఎంపీపీఎస్ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండా పరిధిలో గల గుడితండా ఎంపీపీఎస్ పాఠశాలలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం లక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.
అనంతరం విద్యార్థులు స్వాతంత్ర్య దినోత్సవం ప్రాముఖ్యతపై ఉపన్యాసాలు ఇచ్చారు. విద్యార్థులు నిర్వహించిన డ్యాన్స్ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, ఉప సర్పంచ్ గోవింద్ నాయక్, నాసి నాయక్, బిక్య నాయక్, గంగారం నాయక్, రెడ్యా నాయక్, రామ్ రామచందర్, రవి తదితరులు పాల్గొన్నారు.

























