కమ్మర్ పల్లి లో ప్రజావాణి -మూడు పిర్యాదులు…
రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు పిర్యాదు లు వచ్చినట్లు ఇంచార్జి ఎంపీడీఓ సదాశివ్ తెలిపారు. అందులో రెండు రెవిన్యూ, ఒకటి పంచాయతీ రాజ్ ల వచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నరేష్, ఎంఈఓ నేర ఆంధ్రయ్య, వివిధ ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.























