భీంగల్లో జలసిరి కార్యక్రమం – ఫారం పాండ్ నిర్మాణానికి భూమిపూజ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీంగల్ మండలం బాబా పూర్ గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా డిచ్పల్లి నారాయణ రైతు పొలంలో ఫారం పాండు నిర్మాణానికి ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ భూమి పూజ నిర్వహించారు..
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. పంట కుంటలు ద్వారా వర్షం నీటిని వినియోగించుకోవడానికి అదే విధంగా భూగర్భ జలాల మట్టం పెరగడానికి సహాయం పడుతుంది అదేవిధంగా వర్షాభావ సమయంలో పంటలకు కీలక నీటి సదుపాయం కల్పించుటకు ఉపయోగపడుతుందని తెలిపారు.
ప్రతి గ్రామంలో 5 రైతు ఫారం పాండ్లు అదేవిధంగా ఐదు వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు సిబ్బంది కృషి చేయాలని కోరారు .
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సమీర్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, టెక్ని అసిస్టెంట్ గణేష్, ఎఫ్ ఏ మధు తదితరులు పాల్గొన్నారు.

























