అనారోగ్యంతో బాధపడుతున్న వికార్ హుస్సేన్ కుటుంబానికి రూ.2 లక్షల CMRF చెక్కు
ఆర్మూర్లో బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేసిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
ఆర్మూర్: అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఆర్మూర్ పట్టణం 15వ వార్డుకు చెందిన వికార్ హుస్సేన్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం అందింది.
వికార్ హుస్సేన్ కుటుంబ సభ్యులు తమ ఆర్థిక పరిస్థితిని కాంగ్రెస్ నాయకుల ద్వారా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన CMRF ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును ఆర్మూర్ పట్టణంలోని PVR భవన్లో బాధిత కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందేలా కృషి చేసిన ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు డొండి రమణ, ఇస్సపల్లి గ్రామ సర్పంచ్ జీవన్, చేనేత సహకార సంఘం చైర్మన్ చిన్న రవి, కౌన్సిలర్లు కోడిదల మల్లయ్య, నాగేందర్, పీసీసీ మాజీ కార్యదర్శి ఖాంధేశ్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు జిమ్మీ రవి, డైరెక్టర్లు వాసు, శేఖర్, మోసిన్, షాహిద్, కలికోట శ్రీనివాస్, అమృత రావు, బిర్యానీ మహేందర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

























