ధర్పల్లి మండలంలో ఘనంగా గురుపూజోత్సవం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: మండల కేంద్రంలోని శుభోదయం NCH దివ్యాంగుల పునరావాస కేంద్రంలో గురుపూజోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కేంద్రంలో సేవలు అందిస్తున్న సిబ్బందిని దివ్యాంగులు స్వయంగా సత్కరించి శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల సమాఖ్య కార్యదర్శి గంగలక్ష్మి మాట్లాడుతూ.. అన్ని అవయవాలు బాగున్న వారు జరుపుకున్నట్లే దివ్యాంగులతో వేడుకలు జరిపించడం చాలా ఆనందంగా ఉందన్నారు. దివ్యాంగులు తమ వైకల్యాన్ని తలచుకొని బాధపడకుండా సంతోషంగా ఉండేలా అన్ని కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో సీసీ బుచ్చన్న, కార్యకర్తలు నర్సవ్వ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

























