పారిశుధ్య పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: హనుమంత్ రెడ్డి…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధర్పల్లి మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ధర్పల్లి గాంధీచౌక్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ 33 నెలల పాలనలో అభివృద్ధి శూన్యంగా మారిందని ఆరోపించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, తక్షణమే పారిశుధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

























