రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం
61వ సారి రక్తదానంతో ఆదర్శం
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో లచ్చిరెడ్డి (70) కి ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో జిల్లా కేంద్రానికి చెందిన జీడిపల్లి శ్రీనివాస్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి 61 వసారి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007 నుండి రక్తదాన కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని నాడు కామారెడ్డికే పరిమితమైన రక్తదాన కార్యక్రమాలు నేడు తెలంగాణ రాష్ట్రమంతా విస్తరించి ఆపదలో ఉన్నవారికి సకాలంలో నష్టాన్ని అందజేయడం కోసం నిరంతరంగా కృషి చేయడం జరుగుతుందని, యువతలో రక్తదానం పట్ల అవగాహన కార్యక్రమాలు తల సేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ వారికి రక్తాన్ని అందజేయడం జరుగుతుందన్నారు రక్తదానానికి ముందుకొచ్చిన శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

























