పోసానిపేట్లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్
పోసానిపేట్: గ్రామంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆదివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులు మంగళారపు రోజా, బండారి లక్ష్మి ఇళ్ల వద్ద ముగ్గు వేసి, కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుద్దాల లింగం, ఉప సర్పంచ్ అంజయ్య, మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
అలాగే పోసానిపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వి.డి.సి. అధ్యక్షులు గంగారం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు.

























