చంద్రాయన్పల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ జితేందర్
ఇందల్వాయి, సెప్టెంబర్ 09: ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి శివారులో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న లారీ ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు మరమ్మతుల కోసం ఎన్హెచ్ 44 యాజమాన్యం చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. అకస్మాత్తుగా ఫోర్వేను టూవేగా మార్చడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తగిన ముందస్తు హెచ్చరికలు లేకపోవడం ప్రమాదానికి కారణమైందని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.























