కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ…
నిజామాబాద్లోని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో ప్రముఖ కవి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పర్సనల్ ఆఫీసర్తో పాటు రీజినల్ మేనేజర్ కార్యాలయ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక చైతన్యం కోసం కాళోజీ నారాయణరావు తన రచనల ద్వారా చేసిన కృషిని ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది స్మరించుకున్నారు. ఆయన సాహిత్యం, ప్రజా చైతన్యం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అధికారులు, సిబ్బంది పాల్గొని కాళోజీ నారాయణరావుకు ఘన నివాళులు అర్పించారు.

























