ఘన్పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్కు ఘన సన్మానం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి సంబంధించి సర్పంచ్ కిరణ్ను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.
కొన్ని సంవత్సరాలుగా గ్రామపంచాయతీకి సొంత భవనం లేకపోవడంతో గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గ్రామ సర్పంచ్ కిరణ్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణానికి చర్యలు చేపట్టారు.
కొత్త భవనం నిర్మాణం పూర్తవడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్ కిరణ్ను అభినందించి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మేట్టు శ్యాంసన్, ఏడ్ల ఆనంద్, తాండ్ర అంజయ్య, నీరడి దేవరాజు, వంగ దేవకరుణ, గడ రాజేశ్వర్, ఎడవెల్లి సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు.

























