సెల్ఫీ వీడియో కలకలం.. యువకుడి మృతి…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మరియా తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విజయ్ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసిన అనంతరం పురుగుల మందు సేవించి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.
తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైన విషయం తెలిసి విజయ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఇటీవల జరిగిన నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు చూసిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలను సెల్ఫీ వీడియోలో విజయ్ పేర్కొన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతికి దారితీసిన పరిస్థితులు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. యువకుడి మృతితో మరియా తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

























