బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ..
ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ మేడం ముదక్పల్లి…
పి హెచ్స్సీ పరిధిలోని కానాపూర్ నందుగల బస్తి దావకానను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు హాజరు పట్టికను, రికార్డ్స్ ను, ఓపెన్ రిజిస్టర్ను, ఔషధాల స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల నివారణకు సరిపడా మందుల ను అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని, తద్వారా ఔట్ పేషెంట్ రోగుల సంఖ్య పెంచాలని సూచించారు. జీవనశైలి వ్యాధులు నిర్ధారణ చేస్తూ అవసరమైన వారికి రిఫర్ చేయాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బస్తి దావకన సిబ్బంది ఉన్నారు.























