తెలంగాణ విశ్వవిద్యాలయంలో బి.ఎడ్, బి.పి.ఎడ్ II సెమిస్టర్ ఫలితాలు విడుదల…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో బి.ఎడ్, బి.పి.ఎడ్ రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి. యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరితో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కె. సంపత్ కుమార్ ఫలితాల వివరాలను వెల్లడించారు. బి.ఎడ్ రెండో సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 1,334 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. వీరిలో 241 మంది పురుషులు, 1,093 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.
మొత్తం 1,173 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, వీరిలో 195 మంది పురుషులు, 978 మంది మహిళలు ఉన్నారని తెలిపారు.
అదేవిధంగా బి.పి.ఎడ్ రెండో సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 100 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. వీరిలో 52 మంది పురుషులు, 48 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం 90 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, వారిలో 45 మంది పురుషులు, 45 మంది మహిళలు ఉన్నారని వివరించారు.
ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వర్సిటీ ఉపకులపతి, రిజిస్ట్రార్ అభినందనలు తెలిపారు. విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

























