భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు జరుపుకోవాలి
ప్రశాంత వాతావరణంలో నవరాత్రి వేడుకలు నిర్వహించాలి: దోమకొండ ఎస్ఐ ప్రభాకర్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
దోమకొండ: వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని దోమకొండ మండల ఎస్ఐ ప్రభాకర్ సూచించారు.
మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లోని అన్ని వినాయక మండపాల నిర్వాహకులు ఉత్సవాలను భక్తిపూర్వకంగా, ఆనందోత్సాహాలతో నిర్వహించాలని ఆయన కోరారు. మండపాల వద్ద డీజేలు, అధిక శబ్దాలకు దూరంగా ఉండాలని సూచించారు.
విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్ సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
వినాయక నిమజ్జన కార్యక్రమంలో మండపాల నిర్వాహకులు క్రమశిక్షణ పాటిస్తూ, గ్రూపుల వారీగా వెళ్లాలని ఎస్ఐ ప్రభాకర్ సూచించారు. శోభాయాత్ర, నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, గొడవలకు తావులేకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలు పాటించాలని కోరారు. ప్రజలందరూ సంతోషంగా, ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలను జరుపుకోవడమే పోలీస్ శాఖ లక్ష్యమని ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో దోమకొండ మండల పోలీస్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.

























