మెగా రక్తదాన శిబిరం
తొలి 100 మంది రక్తదాతలకు హెల్మెట్లు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఐవీఎఫ్ సేవాదళ్ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.
రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ బ్లడ్ ఫెడరేషన్ (ఐవీఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు కర్షక్ బీఈడీ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ.. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో రక్తదానంపై అవగాహన కల్పించడంతో పాటు యువతను రక్తదానం వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శిబిరంలో పాల్గొనే తొలి 100 మంది రక్తదాతలకు హెల్మెట్లు అందజేయనున్నట్లు వెల్లడించారు.
రక్తదానం చేసేందుకు ఆసక్తి ఉన్న వారు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ బాలు కోరారు.
మరిన్ని వివరాలకు: 94928 74006 నంబర్ను సంప్రదించాలని సూచించారు.

























