Homeత్రిశూల్ న్యూస్దాతల సహకారంతో సీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ ప్లస్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించిన...

దాతల సహకారంతో సీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ ప్లస్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ…

దాతల సహకారంతో సీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ ప్లస్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ…


వరంగల్ నగరంలోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో దేశ్‌పాండే ఫౌండేషన్, దాతల సహకారంతో రూ.25 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన స్కిల్ ప్లస్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ను రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, దాతలు ఎన్.సి. మూర్తి, జీవన్ మూర్తి, కళాశాల ప్రిన్సిపాల్ జి. పోశయ్య, మాజీ ప్రిన్సిపాల్ ఎ. ధర్మారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముందు మంత్రి కొండా సురేఖకు కళాశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. అనంతరం చంద్రకాంతయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్‌సీసీ క్యాడెట్లు గౌరవ వందనం సమర్పించగా, అతిథులు కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్ స్థాయికి దీటుగా నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలు, విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. యువత నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

అనంతరం దేశ్‌పాండే ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన స్కిల్ ప్లస్ కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించి పరిశీలించారు.

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నెహ్రూ మెమోరియల్ పాఠశాల విద్యార్థులకు డీవార్మింగ్ మాత్రలు అందించారు.

తదుపరి జరిగిన సభలో కళాశాల ప్రిన్సిపాల్ జి. పోశయ్య, మాజీ ప్రిన్సిపాల్ ఎ. ధర్మారెడ్డి, దాత ఎన్.సి. మూర్తి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మంత్రి కొండా సురేఖ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

దాత ఎన్.సి. మూర్తి మాట్లాడుతూ, ఈ కళాశాలలో చదివి విదేశాల్లో స్థిరపడిన తమలాంటి పూర్వ విద్యార్థులు తమ స్వస్థల అభివృద్ధికి చేయూతనివ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

దాత జీవన్ మూర్తి మాట్లాడుతూ, సమాజానికి తిరిగి సేవ చేయగలగడం గొప్ప అవకాశమన్నారు. యువత నిరుద్యోగంతో బాధపడకుండా, కంప్యూటర్ నైపుణ్యాలు సాధించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో దేశ్‌పాండే ఫౌండేషన్ ద్వారా ఈ స్కిల్ ప్లస్ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

చివరగా అతిథులు, దాతలను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సఫాయి కార్మికులకు సత్కారం….

0
సఫాయి కార్మికులకు సత్కారం.... ప్రతి పుట్టినరోజుకు కానుకలతో పలకరింపు... మలినాలెత్తిన చేతులకు మద్దతు తెలిపాలి - మంద మహిపాల్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్... నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు,...

భక్తిశ్రద్ధలతో ఏనుగందుల కృష్ణ హరి రజనిత గారి నివాసంలో దైవ యజ్ఞం..

0
భక్తిశ్రద్ధలతో ఏనుగందుల కృష్ణ హరి రజనిత గారి నివాసంలో దైవ యజ్ఞం.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి పట్టణంలోని ఏనుగందుల కృష్ణ హరి రజనిత నివాసంలో ఆదివారం దైవ యజ్ఞ కార్యక్రమాన్ని అత్యంత...

మూడు బైకులు ఒకదాని ఒకటి ఢీ కొని ఒకరు మృతి…

0
మూడు బైకులు ఒకదాని ఒకటి ఢీ కొని ఒకరు మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో గుర్రపు. కిషన్ వయసు (46) సంవత్సరాలు మెంట్రాజ్ పల్లి...

వివాహ శుభకార్యాలు, గృహప్రవేశం, పదవీ విరమణ కార్యక్రమాల్లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
వివాహ శుభకార్యాలు, గృహప్రవేశం, పదవీ విరమణ కార్యక్రమాల్లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్వహించిన పలు వివాహ శుభకార్యాలు, గృహప్రవేశం,...

ఆధ్యాత్మికతతో సేవాభావం.. ఆలయ పరిశుభ్రతకు యోగ సభ్యుల శ్రీకారం…

0
ఆధ్యాత్మికతతో సేవాభావం.. ఆలయ పరిశుభ్రతకు యోగ సభ్యుల శ్రీకారం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్, ఆగస్టు 30: ఆలయాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా భావిస్తూ భీమ్‌గల్ యోగ సభ్యులు సేవా కార్యక్రమానికి శ్రీకారం...

సఫాయి కార్మికులకు సత్కారం….

0
సఫాయి కార్మికులకు సత్కారం.... ప్రతి పుట్టినరోజుకు కానుకలతో పలకరింపు... మలినాలెత్తిన చేతులకు మద్దతు తెలిపాలి - మంద మహిపాల్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్... నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు,...

భక్తిశ్రద్ధలతో ఏనుగందుల కృష్ణ హరి రజనిత గారి నివాసంలో దైవ యజ్ఞం..

0
భక్తిశ్రద్ధలతో ఏనుగందుల కృష్ణ హరి రజనిత గారి నివాసంలో దైవ యజ్ఞం.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి పట్టణంలోని ఏనుగందుల కృష్ణ హరి రజనిత నివాసంలో ఆదివారం దైవ యజ్ఞ కార్యక్రమాన్ని అత్యంత...

మూడు బైకులు ఒకదాని ఒకటి ఢీ కొని ఒకరు మృతి…

0
మూడు బైకులు ఒకదాని ఒకటి ఢీ కొని ఒకరు మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో గుర్రపు. కిషన్ వయసు (46) సంవత్సరాలు మెంట్రాజ్ పల్లి...

వివాహ శుభకార్యాలు, గృహప్రవేశం, పదవీ విరమణ కార్యక్రమాల్లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
వివాహ శుభకార్యాలు, గృహప్రవేశం, పదవీ విరమణ కార్యక్రమాల్లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్వహించిన పలు వివాహ శుభకార్యాలు, గృహప్రవేశం,...

ఆధ్యాత్మికతతో సేవాభావం.. ఆలయ పరిశుభ్రతకు యోగ సభ్యుల శ్రీకారం…

0
ఆధ్యాత్మికతతో సేవాభావం.. ఆలయ పరిశుభ్రతకు యోగ సభ్యుల శ్రీకారం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్, ఆగస్టు 30: ఆలయాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా భావిస్తూ భీమ్‌గల్ యోగ సభ్యులు సేవా కార్యక్రమానికి శ్రీకారం...
Translate »
error: Content is protected !!