గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం:రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా లో గుండారం,కొత్తపేట గ్రామాల అభివృద్ధి పనులకు రూ.20 లక్షలు నిధుల ఎస్డీఎఫ్ నిధుల కింద ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని,గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు.ఆదివారం నిజామాబాద్ రూరల్ మండలం గుండారం లో సబ్ సెంటర్ భవన నిర్మాణానికి రూ.5 లక్షలు, రెడ్డి సంఘం భవనం కాంపౌండ్ వాల్ కు రూ. 5 లక్షలు నిధులు మంజూరు ఇచ్చారు.ఈ మేరకు ఆ గ్రామ రెడ్డి సంఘం ప్రతినిధులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. పార్టీ సీనియర్ నాయకులు బాగారెడ్డి ఉన్నారు.అటు మండలంలోని కొత్తపేట్ గ్రామ అభివృద్ధి కోసం స్పెషల్డెవలప్మెంట్ ఫండ్ నిధుల కింద రూ.10లక్షల విలువైన ప్రొసీడింగ్ పత్రాలను కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు. ఎల్లయ్య గ్రామ సర్పంచ్ శ్రీధర్ గౌడ్, గ్రామ పెద్దలకు ఎమ్మెల్యేఅందజేశారు.ఇందులో ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో సిసి డ్రెయిన్స్ కు రూ.5 లక్షలు,సోముల్ నాయక్ తాండా లో జగదాంబ ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.5 లక్షల నిధులకు సంబంధించిన పనులు ఉన్నాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ,గ్రామ అభివృద్ధికి ఇప్పటికే లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గ్రామంలో అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని,రెండో విడతలో మరిన్ని అర్హులకు ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, దేవాలయాలు,సామాజిక భవనాల అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సహకారంతో ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు,నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.























