విద్యార్థె అటెండర్ గా మారిన వేళ…
బడి గంట బాధ్యత విద్యార్థులదేనా.!?
ఇనాయత్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల తీరుపై ప్రశ్నలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని ఇనాయత్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులచే బడి గంట మోగింపజేస్తున్నారనే విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. విద్యార్థుల ప్రధాన బాధ్యత చదువుపై దృష్టి పెట్టడమే తప్ప, పాఠశాల నిర్వహణకు సంబంధించిన పనులు చేయించడం సమంజసం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పాఠశాలలో బడి గంట కొట్టడం వంటి బాధ్యతలు సిబ్బంది లేని యెడల ఉపాధ్యాయులు అయినా నిర్వహించాల్సి ఉండగా,చిన్నారులతో ఆ పని చేయించడం సరైన పద్ధతి కాదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి బాధ్యతలు అప్పగించడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఈ అంశంపై సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి వాస్తవాలను పరిశీలించి,అవసరమైతే తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.విద్యార్థుల సమయాన్ని పూర్తిగా విద్యాభ్యాసానికే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ విషయంపై ఫోన్లో ఎంఈఓ ఆంధ్రయ్య ను సంప్రదించగా తాను హెడ్మాస్టర్ల ట్రైనింగ్ లో ఉన్నట్లు ఎంఈఓ తెలిపారు.

























