Homeతెలంగాణసాగునీటి కోసం మరో యుద్ధం... లక్షలాది మందితో త్వరలో కార్యాచరణ - కేసీఆర్...

సాగునీటి కోసం మరో యుద్ధం… లక్షలాది మందితో త్వరలో కార్యాచరణ – కేసీఆర్…

సాగునీటి కోసం మరో యుద్ధం… లక్షలాది మందితో త్వరలో కార్యాచరణ – కేసీఆర్…


తెలంగాణలో సాగునీరు, తాగునీటి సరఫరా పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం లక్షలాది మంది రైతులు, కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో మరో జల యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

*_కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్…_*

ఆదివారం ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ శాసనసభా పక్షం (BRSLP) సంయుక్త సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకోవచ్చని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) స్పష్టం చేసినప్పటికీ, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నీటిని ఎత్తిపోయడం లేదని కేసీఆర్ ఆరోపించారు.

మేడిగడ్డ బ్యారేజీ వద్ద చిన్నపాటి మరమ్మతులు చేస్తే దాదాపు 13 జిల్లాల రైతాంగానికి సాగునీరు అందుతుందని… కానీ ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రాజెక్టును పక్కన పెట్టిందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.

నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ తెలంగాణ రైతాంగానికి విడుదల చేయకుండా, పక్క రాష్ట్రం వాడుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులపై ఇదే రకమైన అలసత్వం వహిస్తే తానే స్వయంగా లక్షలాది మందితో ప్రజాక్షేత్రంలోకి దిగి ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తానని హెచ్చరించారు.

ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల విడుదల, పాలిటెక్నిక్ విద్యపై తెచ్చిన జీవో 97 ప్రభావం, గురుకులాల్లో వసతుల లేమి వల్ల జరుగుతున్న విద్యార్థుల మరణాలపై సభలో గళమెత్తాలని పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. పట్టా భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల అత్యవసర సమయాల్లో భూములు అమ్ముకోలేక పేద, మధ్యతరగతి ప్రజలు పడుతున్న గోసను నిలదీయాలని చెప్పారు. జాబ్ క్యాలెండర్ విడుదలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.

మిషన్ భగీరథ నిర్వహణ లోపాలు, కరెంట్ సరఫరాలో కోతలు, వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే నిర్ణయాలను ఎండగట్టాలని సూచించారు. ఫార్మాసిటీ రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేయడం, సింగరేణిలో అవినీతి, మెట్రో నిర్వహణ భారాన్ని ప్రభుత్వంపై వేయడం, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ నిధుల విడుదల అంశాలపై ప్రభుత్వాన్ని పట్టుబట్టాలని స్పష్టం చేశారు.

అసెంబ్లీని ప్రజా సమస్యల చర్చా వేదికగా కాకుండా వ్యక్తిగత విమర్శలకు నిలయంగా మార్చుతున్న అప్రజాస్వామిక విధానాన్ని ఉభయ సభల్లో తిప్పికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ…

0
బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ.. ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ మేడం  ముదక్పల్లి... పి హెచ్స్సీ పరిధిలోని కానాపూర్ నందుగల బస్తి దావకానను ఆకస్మిక తనిఖీ చేశారు....

కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్…

0
కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి…

0
ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ముఖ్యమంత్రి...

ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం…

0
ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి సంబంధించి సర్పంచ్ కిరణ్‌ను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. కొన్ని...

టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…

0
కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన అడుగులు.. టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు... హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగుతుందని పార్టీ సీనియర్...

బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ…

0
బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ.. ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ మేడం  ముదక్పల్లి... పి హెచ్స్సీ పరిధిలోని కానాపూర్ నందుగల బస్తి దావకానను ఆకస్మిక తనిఖీ చేశారు....

కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్…

0
కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి…

0
ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ముఖ్యమంత్రి...

ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం…

0
ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి సంబంధించి సర్పంచ్ కిరణ్‌ను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. కొన్ని...

టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…

0
కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన అడుగులు.. టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు... హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగుతుందని పార్టీ సీనియర్...
Translate »
error: Content is protected !!