ముచ్కూర్లో మహిళా గ్రామ సంఘం నూతన భవన నిర్మాణానికి భూమిపూజ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
ముచ్కూర్ గ్రామం : మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ ముచ్కూర్ గ్రామంలో మహిళా గ్రామ సంఘం నూతన భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామ సంఘ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచ్కు సూచించారు. నూతన భవనంలో మరుగుదొడ్ల నిర్మాణానికి స్వచ్ఛ భారత్ నిధుల ద్వారా మంజూరు అందిస్తామని తెలిపారు.
మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించడంతో పాటు గ్రామాభివృద్ధిలోనూ చురుకైన పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంకుడు గుంతల నిర్మాణంలో మహిళలు ప్రధాన భూమిక పోషించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఏపీవో జీ. నర్సయ్య, ఏపీఎం ప్రమీల, పంచాయతీ కార్యదర్శి సంజీవ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ సంఘం మహిళలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

























