గురువుల పాత్ర అసమానమైనది…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
వేల్పుర్ శివారులో గల శ్రీ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమములో గురువారము సాయిబాబా గర్భాలయంలో శ్రీ గోవింద గిరి స్వామి శిష్యుడు బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ మానవుడి భవ బంధాల నుండి విముక్తుడిని చేసి ఆత్మసాక్షాత్కార దిశగా నడిపించడంలో గురువు పాత్ర అసమానమైనది. అత్యున్నతమైనది. గురువులు శిష్యుల ఉద్దరనే ధ్యేయంగా జీవిస్తారు. గ్రంథాల ద్వారా దొరకని గూడమైన సత్యాలను అనుభవ పూర్వకంగా వివరిస్తారు. సాధనలో ఎదురయ్యే ఇబ్బందులను, భయాలను తొలగించి ధైర్యాన్ని నింపుతారు. తద్వారా ముక్తి మార్గం సులువు అవుతుంది అని అన్నారు. ధ్యాన మందిరంలో భజన కళాకారులు భజనలు చేశారు.

పల్లకి సేవను ప్రాంగణం చుట్టూ తిప్పుతూ గజ్జెలు గల్లు గల్లునా మువ్వలు మెల్లే మెల్లేనా, రారా కన్నయ్య మా ఇంటికి అంటూ భజన పాటలు పాడుతూ పల్లకి సేవలో తరించారు. గోవింద్ పేటకు చెందిన గెంటేల లక్ష్మీ ఒడ్డెన్న దంపతులు అన్నదానం చేశారు. అన్నదాతలకు ఆలయ అర్చకులు ప్రవీణ్ కుమార్ పంతులు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, సాయి భక్తులు, సాయి సేవకులు తదితరులు పాల్గొన్నారు.

























