మూడవ వార్డు లో క్యాచ్ ది రైన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ గజానంద్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
కేంద్ర జనశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం CDMA ఆదేశాల మేరకు గురువారం నాడు భీంగల్ పట్టణంలోని 3 వ వార్డ్ ప్రజలకు “జల శక్తి అభియాన్ – జన భాగీ దారి “JSJB -3.0 లో భాగంగా క్యాచ్ ది రైన్ అవగాహన కార్యక్రమం లో భాగంగా నీటి సంరక్షణ సంబంధించి అవగాహన కల్పించడం జరిగింది.
అదేవిధంగా చెత్తను వేరుచేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని, వర్షాకాలం దృశ్య సీజనల్ వ్యాధులు రాకుండా దోమలకు కారణమైన ఇంటిలోని నిలువ నీటిని తొలగించాలని చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గజానంద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఇంకుడు గుంతలను నిర్మించి భూగర్భ జలాలను పెంచడంలో తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 3 వ వార్డ్ కౌన్సిలర్ తోట సతీష్, మెప్మా సిబ్బంది వార్డ్ ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

























