సితాయిపేట్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని సితాయిపేట్ గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సీహెచ్. భూమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ భూమేష్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. అనంతరం ‘‘జై జవాన్.. జై కిసాన్.. భారత్ మాతాకీ జై’’ అంటూ నినాదాలు చేశారు. గ్రామ పెద్దలు, పాఠశాల విద్యార్థులు, గ్రామ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగేటి చంద్రకాంత్, గ్రామ కార్యదర్శి ప్రవీణ్, వార్డు సభ్యులు, గ్రామ యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

























