స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం…
అర్హులందరూ స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవాలి: కౌన్సిలర్లు.
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
కామారెడ్డి పట్టణంలోని 46, 47వ వార్డుల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.
కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆయా రేషన్ షాపుల్లో కార్డుల పంపిణీ చేపట్టారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరూ స్మార్ట్ రేషన్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
రేషన్ డీలర్లు లబ్ధిదారులకు కార్డుల పంపిణీలో సహకరించాలని కోరారు.
కార్డుల పంపిణీ కార్యక్రమంలో రేషన్ డీలర్లు, లబ్ధిదారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

























