మద్యం మత్తులో బైక్ నడిపి యువకుడి మృతికి కారణమైన వ్యక్తిపై కేసు సి ఐ పొన్నం సత్యనారాయణ..
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్గల్ : మద్యం మత్తులో అతివేగంగా బైక్ నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమై ఓ యువకుడి మృతికి కారణమైన వ్యక్తిపై భీమ్గల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 14న రాత్రి పురాణిపేటకు చెందిన తీగల అక్షయ్ (23), స్వరాజ్ అనే స్నేహితుడితో కలిసి బైక్పై వెళ్లాడు. స్వరాజ్ మద్యం సేవించి బైక్ను నడుపుతూ బాబాపూర్ వైపు వెళ్తుండగా, మద్యం మత్తులో అతివేగంగా బైక్ నడిపి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న తీగల అక్షయ్ తలకు తీవ్ర రక్తగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి తండ్రి నర్సగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్షయ్ మృతికి కారణమైన స్వరాజ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. భీమ్గల్ సీఐ పి. సత్యనారాయణ ఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టవద్దని ఆయన హెచ్చరించారు.

























