కాంగ్రెస్ పార్టీలో చేరిన డీబీ తాండా ఉపసర్పంచ్ స్వామి,ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సమక్షంలో చేరిక…
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు నిరంతరం కొనసాగుతున్నాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.
ధర్పల్లి మండలంలోని డీబీ తాండా గ్రామ ఉపసర్పంచ్ స్వామి శనివారం ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నరేష్, ఏఎంసీ డైరెక్టర్ మాంగిత్య నాయక్, నాయకులు వసంత్, శ్రీరామ్, అంబర్ సింగ్, సీతారాం, లింబియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

























