వర్షాల కొరకు శివలింగానికి జలాభిషేకం….
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బాద్గుణ చంద్రశేఖర్…
నందిపేట మండలం ఉమ్మెడ గ్రామ శివారు గోదావరి ఒడ్డున గల అతి పురాతనమైన ఉమామహేశ్వర ఆలయంలో గల శివలింగానికి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గంగా జలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ గర్భగుడి గడప వద్ద మట్టితో కట్టను కట్టి శివలింగం మొత్తం మునిగే విధంగా ప్రజలంతా బిందెలు పట్టుకొని పక్కనే గల గోదావరి నుంచి జలాలను తెచ్చి నింపడం జరిగింది. అనంతరం నంది విగ్రహానికి జలాభిషేకం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రతి సంవత్సరం అతి పురాతనమైన శివలింగాన్ని గంగాజలంతో నింపుతామని గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే ఆ ఉమామహేశ్వర ఆలయం మొత్తం నీటిలో మునిగిపోతుందని కేవలం శిఖరమే తెలియాడుతుందని కానీ ఈ సంవత్సరం వర్షాలు పడకపోయేసరికి రైతులు, ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారని, అందుకే ఈరోజు ఉమ్మెడ విడిసి ఆధ్వర్యంలో జలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు, సభ్యులు, నాయకులు , పంచాయతీ కమిటీ సభ్యులు, గ్రామ యువకులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.























